Wednesday, March 14, 2012

Laxmi narasimha kalyanam

              శ్రీ లక్ష్మీ నరసింహ కల్యాణం

కమనీయం నరసింహుని కల్యాణం కావ్యం,
కాంచినవారి నోముల పంట
చేసినవారికి సిరులేఇంట....|| కమనీయం||

ఒకవంక శ్రీదేవీ చూసేను క్రీగంట
నొక వంక భూదేవీ తలవంచే బిడియంగ

 బుగ్గల నిండా సిగ్గులతో భామలిద్దరు మురిసేరు...|| 
                          .........||కమనీయం||    
 బహు ముఖుడు బ్రహ్మ దేవుడు బ్రాహ్మణుడై నిలిచేను,

కన్యల నివ్వ సాగరుడు గంగమ్మతో వచ్చేను.
మహేశుడు గణేశుడు సురేశుడు గిరీశుడు
పెద్దలై హరిముందు గద్దెనెక్కి కూర్చుండిరి
.||
,
. .........||కమనీయం||
 

No comments:

Post a Comment